Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. తొలుత హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా ఏపీ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లారు.
ఇటీవల ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR), మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఇటీవల ముందస్తు బెయిల్ మంజూరైంది. అదే సమయంలో దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు ఆయనను ఆదేశించింది. అలాగే వారం రోజుల లోపు రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని నిర్దేశించింది. ఉచిత ఇసుక కేసులో సీఐడీ అధికారులకు పూచీకత్తు, బాండ్ ను చంద్రబాబు సమర్పించారు. ఐఆర్ఆర్ కేసులో కుంచనపల్లి, మద్యం కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయాలకు వెళ్లి పూచీకత్తు, బాండ్లు సమర్పిస్తారు.
విజయవాడ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్నారనే విషయం తెలియగానే పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.
.
.