Boppana Bhava Kumar : బెజవాడ పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. విజయవాడ వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. బుజ్జగించేందుకు దేవినేని అవినాష్, మరికొందరు నేతలు ఆయన ఇంటికి వెళ్లారు. కానీ ఆయన మాత్రం పార్టీకి గుడ్ బై చెప్పాలనే యోచనలో ఉన్నారని తాజా పరిణామాలు స్పష్టంచేశాయి.
మరోవైపు తాజా పరిణామాలపై బొప్పన భవకుమార్ స్పందించారు. పార్టీని వీడొద్దంటూ తనపై తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. టీడీపీ నేతలతోనూ సంప్రదిస్తున్నానని తెలిపారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. వైసీపీని వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు అభ్యర్థిగా పోటీ చేసి బొప్పన భవకుమార్ ఓటమిపాలయ్యారు. 2019 నుంచి వైసీపీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈసారి టిక్కెట్ దక్కదని తేలడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.