EPAPER

TDP-Janasena : ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ-జనసేన సీట్ల రాజకీయం.. అధిష్టానం మనసులో ఉన్నదెవరు..?

TDP-Janasena : ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ-జనసేన సీట్ల రాజకీయం.. అధిష్టానం మనసులో ఉన్నదెవరు..?

TDP-Janasena : సీఎం జగన్‌ను ఢీకొట్టి వైసీపీని మట్టికరిపించేందుకు టీడీపీ, జనసేనలు ఉమ్మడిగా ఎన్నికల బరిలో దిగుతుండగా.. ఇరు పార్టీల మధ్య సీట్ల పంచాయితీతో రాజకీయాలు కాకరేపుతున్నాయి. పెనుమలూరు టికెట్ ఆశిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌. గెలుపు తనదేననే ధీమాలోనూ ఉన్నారు. అటు విజయవాడ పశ్చిమ టికెట్‌ తనదేనంటున్నారు మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్. అయితే.. వీరిద్దరికీ కాకుండా పెనమలూరులో టీడీపీ నుంచి పార్థసారథి.. విజయవాడ పశ్చిమ జనసేన అభ్యర్థిగా పోతిన మహేష్‌ బరిలో దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.


ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో జలీల్‌ఖాన్‌ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో పశ్చిమ సీటు తనకే కేటాయించేలా చంద్రబాబుతో మాట్లాడాలని పవన్‌ను కోరినట్టు సమాచారం. మరోవైపు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ కూడా ఇదే ధీమాలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తనకు నమ్మకం ఉందని.. తప్పకుండా పార్టీ కోసం పోరాడే వ్యక్తులందరికీ న్యాయం జరుగుతుందంటున్నారు కొనకళ్ల. బోడె ప్రసాద్‌ను కానీ, తనను కానీ ఓదార్చే పని లేదని చెబుతున్నారు. టికెట్‌ రాదన్న ప్రచారాన్ని నమ్మవద్దని.. గతంలోనూ ఇలాంటి అసత్య ప్రచారాలు జరిగాయని.. చంద్రబాబు తమకు న్యాయం చేస్తారంటున్నారు. ఇక నేతలంతా ధీమాను వ్యక్తం చేస్తున్నట్టు అధిష్టానం వారినే ప్రజాక్షేత్ర పోరులో దించనుందా..? లేదంటే అధినేతల మనసులో మరొకరు ఉన్నారా అన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.

.


.

Related News

YCP vs Janasena: జనసేనలోకి చేరికలు.. కూటమిలో లుకలుకలు

ysrcp petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, కాకపోతే కోర్టు..

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Big Stories

×