EPAPER

Rajendra Nagar : ప్రాణం తీసిన పతంగి.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదం

Rajendra Nagar : ప్రాణం తీసిన పతంగి.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదం

Rajendra Nagar : సంక్రాంతి పండుగ సెలవుల్లో ఓ కుటుంబంలో తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు తనిష్క్ మృతిచెందాడు.


సంక్రాంతి సెలవులు కావడంతో గాలి పటాలు ఎగుర వేయడానికి తన ముగ్గురు స్నేహితుల తో కలిసి మిద్దె మీదకు వెళ్లాడు. ఈ క్రమంలో గాలిపటం విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్‌తో బాలుడు అక్కడే కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు హుటాహుటిన తనిష్క్ ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడని వైద్యలు ధృవీకరించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాలిపటం ఎగురవేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పిల్లలకు సూచించారు. సెలవుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు తల్లిదండ్రులను హెచ్చరించారు. తమ గారాల పట్టి.. ఇక కనిపించడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Tags

Related News

Florida Woman Buried Husband: ‘దృశ్యం’ సినిమా లాంటి కేసు.. భర్త శవాన్ని ఇంట్లో పాతిపెట్టిన మహిళ.. హత్య మరెవరో చేసి..

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Big Stories

×