Peddapalli : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముగ్గురు క్షేమంగా బయట పడ్డారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నిమ్మనపల్లి నుంచి పెద్ద కల్వలకు వెళ్తున్న TS10 EL 2029 అనే నంబర్ గల నెక్సా కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్ళింది.
ప్రమాదంలో రంగంపల్లికి చెందిన వినీత్ రెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న గాదె అఖిల్, అనురోహిత్ రెడ్డి, సాయిలు బావిలో నుంచి పైపు ద్వారా బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.