Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ (ఈడీ) మరోసారి విచారణకు హాజరు కావలని నాల్గోవ సారి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఈ నెల 18 న హాజరు కావాలని ఈడీ పేర్కొంది.
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ (ఈడీ) మరోసారి విచారణకు హాజరు కావలని నాల్గవ సారి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఈ నెల 18 న హాజరు కావాలని ఈడీ పేర్కొంది.
గతంలో కేజ్రీవాల్ విచారణకు హాజరవ్వాలని ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ మాత్రం విచారణకు ఒక్కసారి కూడా హాజరుకాలేదు. తాజాగా జనవరి 3న మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. తనకు ఈడీ సమన్లు జారీ చేయడంపై కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమైనవి అని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే సమన్లు జారీ చేశారని విమర్శించారు. జారీ చేసిన సమన్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నుంచి తనను దూరం చేయ్యడానికే ఈడీ సమన్లు జారీ చేసిందని విమర్శించారు.