Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా వజ్రాలు, విదేశీ నగదు పట్టుబడ్డింది. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 10న హైదరాబాద్కు చెందిన ఇద్దరు ప్రయాణికులు దుబాయ్కి వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారి ప్రవర్తనపై భద్రతా అధికారులకు అనుమానం వచ్చింది. వారిని అదుపులోకి తీసుకుని సామాగ్రిని క్షుణ్నంగా తనిఖీలు చేశారు.
చాక్లెట్ ప్యాకెట్లలో తెలుపు రంగు కాగితంలో చుట్టిన పొట్లాలు ఉన్నాయి. తెరిచి చూడగా అందులో రూ.6.03 కోట్లు విలువైన వజ్రాలు ఉన్నాయి. రూ.9.83 లక్షల విదేశీ నగదు, రూ.లక్ష ఇండియన్ కరెన్సీ దొరకడంతో అధికారులు విస్తుపోయారు. వారి దగ్గర పట్టుబడిన వజ్రాలు, నగదుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఇద్దరినీ అరెస్టు చేశారు.
.
.