EPAPER

Wineshops Close : మందుబాబులకు అలర్ట్.. ఆ రోజు మద్యం షాపులు బంద్..

Wineshops Close : మందుబాబులకు అలర్ట్.. ఆ రోజు మద్యం షాపులు బంద్..

Wineshops Close : జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం అంగరంగవైభవంగా జరగనుంది. యావత్ దేశమంతా ఎదురుచూస్తోన్న ఈ వేడుకకు అయోధ్య నగరి ముస్తాబవుతోంది. రామయ్యకు దేశనలుమూలల నుంచి కానుకలొస్తున్నాయి. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశప్రజలంతా ఆ రోజున ఇంట్లో దీపాలు వెలిగించి.. దీపావళిని జరుపుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ఈ క్రమంలో జనవరి 22న అయోధ్య సహా.. ఉత్తరప్రదేశ్ మొత్తం మద్యంతో పాటు మాంసం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా డ్రై డేను ప్రకటించాయి.


ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా రామమందిర ప్రారంభోత్సవం రోజున డ్రై డే ప్రకటించారు. జనవరి 22న రాష్ట్రంలో పబ్బులు, మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. ఛత్తీస్ గఢ్ నుంచి అయోధ్యకు 300 మెట్రిక్ టన్నుల సువాసన గల బియ్యాన్ని పంపనున్నారు.

అస్సాం, జైపూర్ లలోనూ అక్కడి ప్రభుత్వాలు డ్రై డే ప్రకటించాయి. జైపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెరిటేజ్ ఏరియాల్లో జనవరి 22న మాంసం దుకాణాలను మూసివేయనున్నారు. హెరిటేజ్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని స్థానిక బీజేపీ నాయకుడు గోపాల్ శర్మ డిమాండ్ చేయగా.. ఆ ప్రతిపాదనను మేయర్ మునేష్ గుజ్జర్ తిరస్కరించారు.


Related News

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Big Stories

×