Guntur kaaram: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఒక్కో సినిమాకు గానూ తీసుకునే రెమ్యూనరేషన్ అప్పుడప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. వాళ్లు తీసుకునే రెమ్యూనరేషన్ తెలిసి నెటిజన్లు కూడా షాక్ అవుతుంటారు. అయితే మహేశ్ తన లేటెస్ట్ మూవీకి తీసుకున్న పారితోషికం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, సునీల్.. ఇలా చాలామంది స్టార్ నటులు ఇందులో కీలక పాత్ర పోషించారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని నాగవంశీ, రాధకృష్ణ నిర్మించారు. ఇక భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మహేశ్ వన్ మ్యాన్ షో చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అతడి డాన్స్ ఓ రేంజ్లో ఉందని అంటున్నారు. ఇప్పటివరకు ఏ సినిమాలో వేయని డాన్స్.. ఈ సినిమాలో ఇరక్కుమ్మేశాడు మహేశ్.
ఇదంతా ఒకెత్తయితే ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్.. తను నటించే ఒక్కో సినిమాకు భారీగానే పారితోషికం తీసుకుంటున్నాడు. అయితే గుంటూరు కారం సినిమాకు కూడా అలానే తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మహేశ్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలిసి అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఇది చాలా తక్కువ రెమ్యునరేషన్. ఒక స్టార్ హీరోగా ఉన్న మహేశ్ ఇంత తక్కువ తీసుకోవడం ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు.