AICC Meeting : ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఇవాళ ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహించింది. కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, లక్షద్వీప్, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని లోక్సభ స్థానాల సమన్వయకర్తలతో ఏఐసీసీ నేతల చర్చలు జరిపారు.
అన్ని లోకసభ నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే సీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈనెల 7న అన్ని లోక్సభ నియోజకవర్గాలకు ఏఐసీసీ సమన్వయకర్తలను నియమించిన సంగతి తెలిసిందే.