CM Revanth Reddy : రహదారి భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) గూగుల్ (Google) ప్రతినిధులతో చర్చించారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ గూగుల్ ప్లాట్ఫాంల వినియోగంపై వారితో సీఎం చర్చించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో డిజిటల్ వ్వవస్థను అభివృద్ధి చేసేందుకు ఆసక్తి చూపారు. తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చేందుకు కావాల్సిన సాంకేతికత, నైపుణ్యాలు తమ వద్ద ఉన్నాయని చంద్రశేఖర్ సీఎంకు వివరించారు.
గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్తో పాటు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అరుణ్ తివారీ, క్యాన్సర్ వైద్యులు చిన్నబాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు పాల్గొన్నారు.