Sankranti Rush : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సంబరాలు మొదలవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి పిండి వంటకాల కోసమైన ఇంటికి వెళ్లాల్సిందే. వెళ్లి కుటుంబ సభ్యులతో సమయం గడపాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో గొప్పగా జరుపుకునే సంక్రాంతి పండుగ కోసం పయనమైన వాహనాలతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది.
హైదరాబాద్లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో పండగకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ప్లాజా వద్ద వాహనాలు భారీగా వరుస కట్టాయి. ఫాస్ట్ట్యాగ్ ఉన్నప్పటికీ ఎక్కువగా వాహనాలు వస్తుండటంతో నెమ్మదిగా కదులుతున్నాయి. అక్కడే వాహనాలను పోలీసులు తనిఖీ చేయడంతో మరింత జాప్యం జరుగుతోంది.