EPAPER

Anantapur : ఏడేళ్లకు పుట్టిన బిడ్డ.. బలితీసుకున్న నిమ్మకాయ

Anantapur : ఏడేళ్లకు పుట్టిన బిడ్డ.. బలితీసుకున్న నిమ్మకాయ
This image has an empty alt attribute; its file name is ac6193b09fae0172148bf0b93e06390c.jpg

Anantapur : ముక్కు పచ్చలారని చిన్నారిని నిమ్మకాయ బలిగొంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోవిందరాజు, దీప అనే దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఏడేళ్ల తరువాత చిన్నారి జస్విత జన్మించింది. 9 నెలలు చిన్నారి బుధవారం సాయంత్రం ఆడుకుంటూ ఉన్నట్టుండి నిమ్మకాయ నోట్లో పెట్టుకుంది. గొంతులో ఇరుక్కుపోయిన నిమ్మకాయను తీయడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు.


సాధ్యం కాకపోవడంతో పెద్దవడుగూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు కూడా పాప గొంతులో ఇరుక్కున్న నిమ్మకాయను బయటకు తీయలేకపోయారు. దీంతో 108 వాహనంలో అనంతపురం నుంచి పామిడిలో ఉన్న ఒక ప్రైవేట్ డాక్టర్ వద్ద చూపించారు. కానీ.. అప్పటికే చిన్నారి శ్వాస ఆగిపోయిందని డాక్టర్ తెలిపారు. అక్కడి నుంచి పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించగా.. వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పెళ్లైన ఏడేళ్లకు.. లేకలేక పుట్టిన పాపను అల్లారుముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులకు కడుపుశోకం మిగిలింది. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×