Ayodhya Express: బాలరాముడి ప్రతిష్టాపన కోసం అయోధ్య సిద్ధమవుతోంది. 2 వేల 100 బ్యారేళ్ల ఆవనూనె అయోధ్యకు చేరుకుంది. సీతా రసోయి కార్యక్రమంలో ఈ నూనెను ఉపయోగించనున్నారు. రాజస్థాన్లోని జైపూర్ నుంచి ఈ వాహనాలు వచ్చాయి. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ.. గవర్నర్ మిశ్రా ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
Plastic free Clean Ayodhya
ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరగా ముస్తాభవుతున్న అయోధ్యలో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు అధికారులు. క్లీన్ అయోధ్య, ప్లాస్టిక్ ఫ్రీ అయోధ్య డ్రైవ్ను చేపట్టారు. ఇప్పటికే అయోధ్యను క్లీన్ చేసే పనులను ప్రారంభించారు.
U P Holiday on Jan 22
అయోధ్య భవ్యమందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజైన జనవరి 22న యూపీ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్. ఆరోజు లిక్కర్ షాపులను మూసేయాలని ఆదేశించారు. అయోధ్యలో జరుగుతున్న ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
VARANASI DEEPOTSAV
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. దీంతో వారణాసిలో ఒక్కసారిగా దీపాల కొనుగోళ్లు పెరిగాయి. ఆ రోజున వారణాసిలో దీపోత్సవ్ నిర్వహించాలని పిలుపునివ్వడంతో ఒక్కసారిగా దీపాలకు డిమాండ్ పెరిగింది.
MUMBAI DEEPOTSAV
ముంబైలో కూడా జనవరి 22న దీపోత్సవ్ నిర్వహించనున్నారు రామ భక్తులు. లక్ష దీపాలతో దీపోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. దీని కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లను చేస్తున్నారు.
AYODHYA AKHAND JYOTHI
బాలరాముడి ప్రతిష్టాపన అనంతరం వెలిగించే అఖండ జ్యోతి అయోధ్యకు చేరుకుంది. గర్భగుడిలో ఉండే ఈ అఖండ జ్యోతిని ప్రత్యేకంగా తయారు చేయించారు. 25 ఏళ్ల పాటు ఈ అఖండ జ్యోతి సేవలందించనుందని తయారీదారులు తెలిపారు.
AYODHYA GOLDEN DOORS
అయోధ్య రామమందిరానికి మొదటి బంగారు తలుపును ఏర్పాటు చేశారు. గర్భగుడి మొదటి అంతస్తులో ఈ బంగారు తలుపును ఏర్పాటు చేశారు. మరో మూడు రోజుల్లో మరో 13 బంగారు తలుపులు ఆలయంలో ఏర్పాటు చేయనున్నారు. ఆలయంలో మొత్తం 46 తలుపులను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 42 తలుపులకు బంగారు పూత పూయనున్నారు.
AYODHYA AIRPORT SECURITIES
అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్టకు 7 వేల మంది వీవీఐపీలు హాజరవుతున్నారు. దీంతో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య ఎయిర్పోర్ట్లో 150 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండోలను మోహరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర భద్రత, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమీక్షలో ఈ ఎయిర్పోర్ట్కు CISF ప్రొఫెషనల్ సెక్యూరిటీని సిఫార్సు చేయడంతో కేంద్రం ఆమోద ముద్ర వేసింది.
.
.