Rangareddy Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ రౌడిషీటర్ ను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తఫా షేహిన్ నగర్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు ముబారఖ్ సిగార్ అనే రౌడిషీటర్ పై కత్తులతో దాడిచేసి హత్య చేశారు. దుండగులు రౌడిషీటర్ మర్మాంగాలు కట్ చేసి, ఒంటిపై అనేక సార్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చూడగా.. మృతుడు బాలాపూర్ ప్రాంతానికి చెందిన ముబారఖ్ సిగార్ అనే రౌడిషీటర్ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాలాపూర్ పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.