YCP : కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంను, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షిని ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. కురుబ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. గుమ్మనూరు కుటుంబానికే టికెట్ ఇవ్వాలని, లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఎంపీపీలు, జెడ్పీటీసీలు చెప్పడంతో ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం పలువురి పేర్లను పరిశీలించింది.
విరూపాక్షికు సపోర్ట్ చేస్తానని గుమ్మనూరు జయరాం హామీ ఇవ్వడంతో చివరికి ఆయనకే సీటు కేటాయించింది. అయితే విరూపాక్షికి గుమ్మనూరు వర్గం సహకరిస్తుందా? లేదా? అని జిల్లా వైసీపీలో చర్చ జరుగుతోంది.