Eknath Shinde | మహారాష్ట్ర రాజకీయాల్లో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్ సహా 16 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వర్తించదని స్పీకర్ నార్వేకర్ ప్రకటించారు.
Eknath Shinde | మహారాష్ట్ర రాజకీయాల్లో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్ సహా 16 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వర్తించదని స్పీకర్ నార్వేకర్ ప్రకటించారు.
చట్టపరంగానే ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారని స్పీకర్ తెలిపారు. ఏక్ నాథ్ షిండేని తొలగించే అధికారాలు ఉద్ధవ్ ఠాక్రేకి లేవని చెప్పారు. ఆ అధికారాలు శివసేన అధిష్ఠానమైన రాష్ట్రీయ కార్యకారిణికి మాత్రమే ఉన్నాయని చెప్పారు. శివసేన పార్టీ 1999 రాజ్యాంగ నిబంధనల ప్రకారమే.. శివసేన గుర్తింపు ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందుతుందని తీర్పు వెలువరించారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పెద్ద షాక్ తగిలింది.
జూన్ 2022లో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏక్ నాథ్ షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో శివసేన పార్టీ రెండు భాగాలుగా చీలిపోయింది. ఫలితంగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి(కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సంకీర్ణ)ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో ఈ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. కానీ వీరంతా అనర్హతకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు.
ఎమ్మెల్యేలపై అనర్హత కేసులో సుప్రీం కోర్టు జనవరి 10లోపు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.