Hyderabad : ఆదివారం అయితే చాలు పేద ప్రజలతో మొదలుకొని ప్రతి ఒక్కరు మాంసాహరం అయిన చికెన్ ను ఇష్టంగా తింటారు. కరోనా తర్వాత అయితే చికెన్ తినేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. చికెన్ ధర తక్కువ ఉంటే చికెన్ ప్రేమికులు చికెన్ షాపులకు క్యూ కడతారు. ధర ఎక్కువగా ఉంటే వారంలో ఒక్కసారి అయిన పావుకేజీ అయినా కొని వండుకుని తినే వారు ఉంటారు. అయితే హైదరాబాద్ లో జరిగిన ఓ సంఘటన విషాదం మిగిల్చింది. జితేంద్ర అనే వ్యక్తి గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఫరూక్ నగర్ మండలం లో జరగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Hyderabad : ఆదివారం అయితే చాలు పేద ప్రజలతో మొదలుకుని ప్రతి ఒక్కరు మాంసాహరం అయిన చికెన్ను ఇష్టంగా తింటారు. కరోనా తర్వాత అయితే చికెన్ తినేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. చికెన్ ధర తక్కువ ఉంటే చికెన్ ప్రేమికులు షాపులకు క్యూ కడతారు.
ధర ఎక్కువగా ఉంటే వారంలో ఒక్కసారి.. పావుకేజీ అయినా కొని వండుకుని తినే వారు ఉంటారు. అయితే హైదరాబాద్లో చికెన్ తినడం వల్ల ఓ విషాద ఘటన మిగిల్చింది. జితేంద్ర అనే వ్యక్తి గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఫరూక్ నగర్ మండలంలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఝార్ఖండ్ కు చెందిన జితేంద్ర, ధర్మేంద్ర ఎలికట్ట గ్రామంలో గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి సమయంలో చికెన్ వండుకుని తింటున్న సమయంలో జితేంద్ర అస్వస్థతకు గురై పడిపోయాడు. దీంతో ఇరుగు పొరుగువారు జితేంద్రను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే జితేంద్ర అప్పటికే మృతిచెందాడని డాక్టర్లు తెలిపారు. అనంతరం అతని మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొవడం వల్లే జితేంద్ర చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.