Corona : దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 605 కొత్త కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 3,643కి చేరినట్లు తెలిపింది.
Corona : దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 605 కొత్త కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 3,643కి చేరినట్లు తెలిపింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో కర్ణాటక, కేరళలో ఇద్దరు చొప్పున కొవిడ్తో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ 5 వరకు కొవిడ్ కేసులు రెండంకెల స్థాయిలోనే ఉన్నాయి. కొత్త వేరియంట్ జేఎన్ 1 వెలుగులోకి రావడం, చల్లని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కేసులు భారీగా పెరగడం గమనార్హం. బాధితుల్లో 92 శాతం హోం ఐసోలేషన్లోనే కోలుకొంటున్నట్లు అధికారులు తెలిపారు.