Ambati Rayudu : వైసీపీకి షాకిచ్చిన అంబటి రాయుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. జనసేనలో రాయుడు చేరబోతున్నాడు. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యాడు.
2023 డిసెంబర్ 28న వైసీపీలో అంబటి రాయుడు చేరాడు. స్వయంగా సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాయుడికి గుంటూరు ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ సీటు దక్కదని తేలడంతో రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పేశాడు. 10 రోజుల్లో పార్టీని వీడి షాకిచ్చాడు. ఆ సమయంలో రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని ట్వీట్ చేశాడు. రాజకీయాలకు దూరమని ట్వీట్ చేసిన కొన్ని రోజులకే జనసేనానితో రాయుడు భేటీ కావడం ఆసక్తిగా మారింది.