Guntur kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఓ రేంజ్లో అందరినీ ఆకట్టుకోగా.. రీసెంట్గా రిలీజైన ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా మహేశ్ – త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో సినిమా కావడంతో గుంటూరు కారంపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘గుంటూరు కారం’ సినిమాను మొదటగా జూనియర్ ఎన్టీఆర్తో చేయాలని అనుకున్నారట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత మరికొంత మంది మాత్రం పవన్ కల్యాణ్ కోసం ఈ సినిమాను త్రివిక్రమ్ రాసుకున్నారని అనుకుంటున్నారు. ఏది ఏమైనా చివరికి ఈ సినిమా మహేశ్ దగ్గరకు వచ్చిందని.. సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెబుతున్నారు.