Charminar Express: నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. స్టేషన్ లో రైలు పట్టాలు తప్పడంతో.. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. పట్టాలు తప్పిన రైలు ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీ కొన్నట్లు అధికారులు తెలిపారు. మూడు బోగీలు పక్కకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదంలో మరికొందరికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు.
చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ రైలు నాంపల్లి స్టేషన్ లో ఆగేందుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. రైలు స్లోగా రన్ అవ్వడంతో పెనుప్రమాదమే తప్పిందని అధికారులు అంటున్నారు. మరోవైపు దక్షిణమధ్య రైల్వే చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై స్పందించింది. రైలు దాదాపు స్టేషన్ లోకి ఎంటరవ్వడంతోనే చాలా మంది ప్రయాణికులు దిగేశారని తెలిపింది. కొందరు ప్రయాణికులు గాయపడ్డారని, వారికి చికిత్స చేస్తున్నారని తెలిపారు. కాగా.. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను తెలుసుకునేందుకు రైల్వే అధికారులు రైలును, పట్టాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
nampally railway station, charminar express accident