Mallu Bhatti Vikramarka | తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చుపెట్టిందని.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం సెక్రటేరియట్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంతా గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దే విధంగా పనిచేస్తున్నామని మండిపడ్డారు.
Mallu Bhatti Vikramarka | తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చుపెట్టిందని.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సెక్రటేరియట్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంతా గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దే విధంగా పనిచేస్తున్నామని మండిపడ్డారు.
హైదరాబాద్ నగరంలో ఫార్మెలా ఈ రేస్ రద్దు కావడంపై బిఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు అనవసరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ-రేసు గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి.. ఈ కార్యక్రమం గురించి బిఆర్ఎస్ హయాంలో ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగింది. అయితే ఆ ఒప్పందంలో తెలంగాణకు ఎటువంటి ఆదాయం లేకపోగా.. రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా ఖర్చు భరించాలని చెప్పారు.
ఈ అగ్రిమెంట్ ప్రకారం.. ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఫార్మెలా ఈ రేస్ టికెట్లు అమ్ముకొని వచ్చే ఆదాయమంతా తీసుకెళ్లిపోతుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి నష్టం చేకూరే ఈవెంట్లు రద్దు చేయడమే ఉత్తమమని ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.