Hyderabad : పెట్రోల్ బంక్ లు మళ్లీ బంద్ అంటూ పుకార్లు రావడంతో హైద్రాబాద్ నగరంలో ఉన్న పలు బంకులు వద్దకు వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. దీంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకులు వద్ద విపరీతంగా రద్దీ ఏర్పడింది. దీంతో పెట్రోల్ బంక్ లు వద్ద నో స్టాక్ బొర్డులు దర్శనం ఇచ్చాయి. అయితే పెట్రోల్ బంక్ లు బంద్ అంటూ వార్తల్లో నిజం లేదని పెట్రోల్ బంక్ యాజమాన్యులు ప్రకటించారు. పెట్రోల్ బంక్ లు బంద్ అంటూ వస్తున్న వార్తలు పుకార్లు అని సృష్టం చేశారు.
Petrol Bunks: పెట్రోల్ బంక్ లు మళ్లీ బంద్ అంటూ పుకార్లు రావడంతో హైదరాబాద్ నగరంలో పలు బంక్లు వద్దకు వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. దీంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకులు వద్ద విపరీతంగా రద్దీ ఏర్పడింది. పెట్రోల్ బంక్లు వద్ద నో స్టాక్ బోర్డ్లు దర్శనం ఇచ్చాయి. అయితే పెట్రోల్ బంక్లు బంద్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పెట్రోల్ బంక్ యజమానులు ప్రకటించారు. పెట్రోల్ బంక్లు బంద్ అంటూ వస్తున్న వార్తలు పుకార్లు అని సృష్టం చేశారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పెట్రోల్ యజమానులు ట్రక్కులను నిలిపివేశారు. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం పడింది. హైదరాబాద్ వంటి ప్రధాన నగరంలో కూడా దీని ప్రభావం పడింది. నగరంలో పెట్రోల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. పెట్రోల్ కోసం బంకుల వద్దకు వాహనదారులు భారీగా క్యూ కట్టారు. చాలా చోట్ల పెట్రోల్ కొరత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్ బంక్లు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని పెట్రోల్ బంక్ ల వద్ద పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.
.
.