IT Raids: హైదరాబాద్ లో ఆదాయపు పన్నుశాఖ (IT) అధికారులు దాడులు నిర్వహించారు. ఒక ఫార్మా కంపెనీలో సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆదాయపు పన్నుశాఖ అధికారులు బృందాలుగా విడిపోయి ఫార్మా కంపెనీ యజమాని, బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం యెనికేపల్లిలో ఉన్న గ్లాండ్ ఫార్మా ప్రతినిధి ఝాన్సీ లక్ష్మీ, రాజు కుటుంబీకులకు చెందిన నీమ్ ట్రీ ఫాంహౌస్లో సోదాలు తనిఖీలు కొనసాగుతున్నాయి.
రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేట ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 9 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సదరు ఫార్మాకంపెనీ పెద్దమొత్తంలో పన్నును ఎగ్గొట్టారన్న ఆరోపణలతోనే దాడులు చేసినట్లు తెలుస్తోంది.