Nizamabad: తెలంగాణలో వీధి కుక్కలు బెడద తప్పడం లేదు. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధుల కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. మాక్లూర్ మండలం కల్లెడలో గతన నెల 25న నిషాన్స్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిషాన్స్ ఆరోగ్యం రెండు రోజుల క్రితం విషమించింది. అయితే పరిస్థితి మరింత విషమంగా మారడంతో హైదరాబాద్ కు తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో నిసాన్స్ చనిపోయాడు. దీంతో.. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇప్పటికైనా కుక్కల బెడద తగ్గేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.