Khammam : అమెరికాలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీయం బంజారా కు చెందిన ముక్కర భూపాల్ రెడ్డి అనే వ్యక్తి కుమారుడు సాయి రాజీవ్ రెడ్డి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న సాయి రాజీవ్ రెడ్డి ఓ పార్శిల్ తీసుకోవడానికి కారులో విమానాశ్రయానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న నేపథ్యంలో ట్రక్ అదుపు తప్పి రాజీవ్ కార్ ని బలంగా ఢీ కొట్టింది. తీవ్రగాయాల పాలైన సాయి రాజీవ్.. చికిత్స పొందుతూ అదే రోజున మరణించాడు.
మృతుడి సోదరి సైతం టెక్సాస్ లో ఉద్యోగం చేస్తుంది. తన తల్లి తండ్రులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తండ్రి అమెరికాకి పయనమై వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.