TSPSC : టీఎస్పీఎస్సీ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సిట్ అదనపు సీపీ రంగనాథ్ తెలిపారు. టీఎస్పీఎస్సీ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో కొన్ని విషయాలు తేలాల్సి ఉందని.. వాటి కోసం ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అన్నారు.
ఇప్పటి వరకూ ఈ కేసులో ఇప్పటివరకు 109 మందిని అరెస్ట్ చేశామని సీపీ రంగనాథ్ తెలిపారు. మరికొంత మందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. టీఎస్పీఎస్సీ కస్టోడియన్ శంకర్ లక్ష్మిని గతంలోనే విచారించామని ఆయన స్పష్టం చేశారు. కేసులో ఎవరి పాత్ర ఎంత ఉంది అనేది తేలాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ కేసులో కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది ఆ పనిలో ఉన్నారని.. త్వరలోనే మీడియాకు మరికొన్ని విషయాలు వెల్లడిస్తామని సిట్ అదనపు సీపీ రంగనాథ్ తెలిపారు.