YCP : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్, మండలి ఛైర్మన్లకు పైసీపీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు ముందు పార్టీ ఫిరాయింపులు మొదలు అయ్యాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్ర శేఖర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారయణ రెడ్డిపై చర్యలు తీసుకొవాలని ఫిర్యాదు చేశారు.
YCP : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్, మండలి ఛైర్మన్లకు పైసీపీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు ముందు పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్ర శేఖర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
అలాగే ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్, సి. రామచంద్రయ్యపై వేటు వేయాలని వైసీపీ నేతలు మండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు. ఇటీవలే టీడీపీలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, జనసేన పార్టీలో వంశీ కృష్ణ యాదవ్ చేరారు.