Telangana Congress : పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రెండు రోజులపాటు 17 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం. ఈ సమీక్షలో భాగంగా ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాల్లో ఎంపీ స్థానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇన్ఛార్జ్ మంత్రులు, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గ ఇంఛార్జ్గా ఉన్న మంత్రి సీతక్క సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. ఆదిలాబాద్ ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా దుర్మార్గపు ఆలోచనలు మానాలన్నారు మంత్రి సీతక్క. ఆటో కార్మికులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చడుతున్నారని పేర్కొన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో పర్యటిస్తారని సీతక్క తెలిపారు.