CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో హిందుస్థాన్ కోకకోలా బెవరేజేస్ ప్రతినిధి బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో 3 వేలకోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్లు కోకకోలా సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి కి తెలిపారు.
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజేస్ ప్రతినిధి బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో 3 వేలకోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కోకాకోలా సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.
సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్ లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ వివరాలు సీఎంకు ప్రతినిధులు వివరించారు. వ్యాపార కార్యకలపాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కోకాకోలా సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.