Bandi Sanjay : బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేటీఆరే అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయనా కేటీఆర్కి ఇంకా అహంకారం తగ్గలేదనన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నయీం అక్రమాస్తులు, డాక్యుమెంట్లు ఎక్కడున్నాయని ఆయన ప్రశ్నించారు. నయీం కేసు తవ్వితే అన్ని పార్టీల నేతల బండారం బయటపడుతుందని పేర్కొన్నారు. నయీం కేసులో బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా ఉన్నారని ఆయన అన్నారు.
ఈటల రాజేందర్కు తనకు ఎలాంటి విభేదాలు లెవని బండి సంజయ్ స్పష్టం చేశారు. అసలు ఈటలకు ఎవ్వరితోనూ విభేదాలు లేవని.. అందరితో ఆయన కలిసే ఉంటారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీని కూడా వదల్లేదు. తెలంగాణ రాష్ట్ర అప్పులను ఎలా తీరుస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని ఆయన కోరారు. అలా అయితేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని బండి సంజయ్ తెలిపారు.