MLC Jeevan Reddy : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై న్యాయ విచారణను అడ్డుకోవాలని బీఆర్ ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. న్యాయ విచారణ నుంచి తప్పించుకోవాలని తన మిత్రపక్షం అయినా బీజేపీని సాయం కోరిందని పేర్కొన్నారు. బీజేపీ నేతలు కూడా కేసీఆర్ చేసిన అవినీతి నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ పై మిమర్శలు గుప్పించారు.
MLC Jeevan Reddy : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై న్యాయ విచారణను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. న్యాయ విచారణ నుంచి తప్పించుకోవాలని తన మిత్రపక్షం అయిన బీజేపి సాయం కోరిందని ఆరోపించారు. బీజేపీ నేతలు కూడా కేసీఆర్ చేసిన అవినీతి నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
జ్యుడీషియల్ ఎంక్వయిరీ చాలా పారదర్శకమైందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విచారణలో పారదర్శక విధానం ఉంటుందనే ప్రభుత్వం.. జ్యుడీషియల్ విచారణ జరిపిస్తుందని వెల్లడించారు. విచారణ సమయంలో అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సహాయం కూడా తీసుకోవచ్చని ఆయన ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డొల్ల ప్రాజెక్ట్ అని ఆరోపించారు. కేవలం డబ్బు సంపాదించడానికే ఈ ప్రాజెక్ట్ను కేసీఆర్ నిర్మించారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.