Meenakshi Chaudhary: మోడల్ నుంచి హీరోయిన్గా మారి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి మీనాక్షి చౌదరి. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ అయిపోయింది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటించే అవకాలను కాజేసింది.
ప్రస్తుతం మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తోంది. అయితే ఇందులో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ చేస్తోంది. ఇక ఎప్పుడైతే మహేష్ బాబు హ్యాండ్ పడిందో.. అప్పట్నుంచే ఈ భామ ఫ్యూచర్ మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకుంటోంది. ఇటీవలే వరుణ్ తేజ్ సరసన మట్కా సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది.
దీంతోపాటు విజయ్ దేవరకొండకు జోడీగా కూడా నటిస్తోందని టాక్. అలాగే తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో కూడా మీనాక్షి ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో ‘ఆర్సి 16’ వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయిందని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్గా మారింది.