Amaravati : అమరావతి రాజధాని ప్రాంత రైతులు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వార్షిక కౌలును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ రైతులను, భూమిలేని కూలీలను ఆదుకోవాలని నినాదాలు చేశారు.
రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ చేయలని రైతులు కోరారు. వారిని సీఆర్డీఏ కార్యాలయం లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు గేట్లు వేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే గేట్లు మూసివేయడం సమంజసం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ అధికారులు బయటకు వచ్చి వినతిపత్రం స్వీకరించాలని రైతులు డిమాండ్ చేశారు.