CI Satish news(Latest news in Andhra Pradesh):
పహాడీ షరీఫ్ సీఐ సతీష్ పై సస్పెన్షన్ వేటు పడింది. సివిల్ వివాదంలో ఓవర్గానికి అనుకూలంగా వ్యవహరించడంతో రాచకొండ సీపీ సుదీర్ బాబు సస్పెండ్ చేశారు.
తుక్కుగూడలో రెండు ఎకరాల భూ వివాదంలో సీఐ సతీష్ తలదూర్చాడు. కొన్నేళ్లుగా ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ.. పంట పండిస్తున్నారు. అయితే.. రెండు నెలల క్రితం కొత్తవ్యక్తులు దొంగ పత్రాలు తయారు చేసి పొజిషన్లోకి రావడానికి ప్రయత్నించారు. దీంతో బాధితులు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ.. సీఐ సతీష్ మాత్రం కొత్తగా వచ్చిన వ్యక్తులకు అనుకూలంగా వ్యవరించాడు.
కొత్తగా వచ్చిన వ్యక్తులు ప్రహరీ గోడను కూల్చివేస్తే.. వారికి సపోర్ట్ చేశాడు. దీంతో బాధితులు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కమిషనర్ సుధీర్ బాబు సీఐ సతీష్ తప్పుచేశాడని తేల్చారు. ఈ తర్వాత సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.