ఈ సంక్రాంతికి పలు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అందులో ‘హనుమాన్’ మూవీ ఒకటి. ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిన్న నిర్వహించారు. ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ గురించి కొన్ని విషయాల్ని పంచుకుంటూ.. ఈ చిత్రానికి థియేటర్ల కేటాయింపు సమస్యపై ప్రస్తావించారు. ఇంతకీ ఆయన ఏమని మాట్లాడారంటే..
క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ – యంగ్ నటుడు తేజా సజ్జ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘హనుమాన్’ మూవీపై అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో మెగాస్టార్ చిరు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. సినిమా కథలో మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు చిత్రాన్ని ఎప్పుడైనా ఆదరిస్తారు. హనుమాన్ తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు పూర్తిగా ఉందని అన్నారు. ఎన్ని సినిమాలు పోటీగా వచ్చినా మన సినిమాలో సత్తా ఉంటే కచ్చితంగా దైవాశీస్సులు ఉంటాయని తెలిపారు.
దీంతోపాటు హనుమాన్ మూవీ యూనిట్ తీసుకున్న ఓ నిర్ణయంపై ఆయన ప్రశంసలు కురిపిస్తూ మీడియా సముఖంగా ఆ విషయాన్ని తెలిపారు. హనుమాన్ సినిమా ఆడినన్ని రోజులు వచ్చే కలెక్షన్లలో ప్రతి టికెట్టుపై ఐదు రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇవ్వాలని చిత్రబృందం నిర్ణయించుకుందని చిరంజీవి తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న మూవీ నిర్మాత నిరంజన్ రెడ్డిపై ఆయన ప్రశంసలు కురిపించారు.