Ganja Crackdown : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. నిందితులు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్నారు. తాజాగా ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా–తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని నాగార్జునసాగర్ చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో వద్ద వాహనలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఎంహెచ్ 24 ఏయూ 8428 నెంబర్ గల డీసీఎంలో ఖాళీ టమాట ట్రేల మధ్యలో నిందితులు గంజాయి పెట్టి తరలిస్తున్నారు. 168 ప్యాకెట్లలో ఉన్న సుమారు 330 కేజీల ఎండు గంజాయిని పోలీసులు గుర్తించారు. ఆ సరుకును స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. గంజాయి అక్రమ తరలింపుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.