EPAPER

Ganja Crackdown : నాగార్జునసాగర్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు.. భారీగా గంజాయి పట్టివేత..

Ganja Crackdown : నాగార్జునసాగర్ చెక్‌పోస్టు వద్ద  తనిఖీలు.. భారీగా గంజాయి పట్టివేత..

Ganja Crackdown : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. నిందితులు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్నారు. తాజాగా ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా–తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని నాగార్జునసాగర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో వద్ద వాహనలను క్షుణ్ణంగా పరిశీలించారు.


ఎంహెచ్ 24 ఏయూ 8428 నెంబర్ గల డీసీఎంలో ఖాళీ టమాట ట్రేల మధ్యలో నిందితులు గంజాయి పెట్టి తరలిస్తున్నారు. 168 ప్యాకెట్లలో ఉన్న సుమారు 330 కేజీల ఎండు గంజాయిని పోలీసులు గుర్తించారు. ఆ సరుకును స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్ కు తరలించారు. గంజాయి అక్రమ తరలింపుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×