Andhra Pradesh today news :
అమరావతిలో 108, 104 సిబ్బంది 23వ తేదీ నుండి సమ్మెకు వెళ్లనున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు, మునిసిపల్ కార్మికులు, SSA సిబ్బంది సమ్మె చేస్తున్నారు. సోమవారం ప్రభుత్వానికి 108, 104 సిబ్బంది సమ్మె నోటీస్ ఇస్తున్నారు. ప్రధాన డిమాండ్ గా అప్కాస్ లో తమను తీసుకోవాలని కోరారు. ఆర్థిక పరమైన అంశాలపై కాకుండా డిపార్ట్మెంట్ అంశాలపై సమ్మె చేయనున్నారు. 104కి హెల్త్ సెంటర్ ను అప్పగించడం ద్వారా సంవత్సరానికి 100 కోట్లు ఆదా అవుతుందని సిబ్బంది చెబుతుంది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా ఈఎంటీ పోస్టులలో 108 సిబ్బందిని తీసుకోవాలి. 108, 104 లో 18 ఏళ్లుగా పని చేస్తున్న వాళ్ళను RTC కాంట్రాక్టు డైవర్స్ గా తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు.
గత కొద్ది రోజులుగా అంగన్ వాడీ వర్కర్ల కనీస వేతనం 26 వేలు చేయాలని, రిటైర్మెంట్ వయస్సు పరిమితిని 62 సంవత్సరాల వరకు పెంచాలని, అంగన్ వాడీ ఆయాలను టీచర్లుగా ప్రమోట్ చేయాలని, అంగన్ వాడీ వర్కర్లు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు .
తర్వాత మున్సిపల్ కార్మికుల కూడా తమ డిమాండ్లను నేరవేర్చలని సమ్మె మొదలు పెట్టారు. పొరుగుసేవలు, పార్ట్టైమ్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు.