అధికార వైసీపీకి ఎన్నికల ముందు షాక్లు మీద షాకులు తగులుతున్నాయి. అటూ పార్టీలో ఫ్రస్ట్రేషన్ .. ఇటు ఫ్యామిలీలో ఫ్రస్ట్రేషన్తో జగన్ అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే చీలికలతో సతమవుతోంది. మార్పులు, చేర్పులు ప్లాన్ బెడిసికొట్టడంతో కింద మీదపడుతోంది. ఇప్పటికే 2 జాబితాలు ప్రకటించడంతో.. అసంతృప్తులు పెరిగారు. బహిరంగంగానే వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అవసరానికి వాడుకుని.. ఇప్పుడు పక్కన పడేస్తున్నారని మండిపడుతున్నారు. ఆయన లెక్కలు ఆయనకుంటే మా లెక్కలు మాకు ఉన్నాయంటన్నారు నేతలు.
ఇదే సమయంలో అసంతృప్తులు, అసమ్మతులు భారీగానే పెరుగుతున్నాయి. కొంతమంది నేతలు వరుసగా టీడీపీ, జనసేనకు క్యూ కడుతున్నారు. జగన్పై సొంత పార్టీ నేతలకే నమ్మకం పోయిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీలో మరో లిస్టు సిద్ధమవుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగులు, ఆశావహులు, నేతలు, కార్యకర్తలు సైతం లిస్టు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇవాలో, రేపో మూడో జాబితా ప్రకటించనున్నారు. 10 మంది ఎంపీ, 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఈ మూడో జాబితాతో మరో 30 మంది వరకూ షాక్ తగలనుంది. మరింత మంది వైసీపీకి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జగన్ నిర్ణయాలతో ఇప్పటికే కీలకనేతలు సైతం పార్టీకి దూరమయ్యారు.
.
.