Mahabubabad: బంధాలు అనుబంధాలు మర్చిపోతూ ఆస్తుల కోసం తగవులాడుకుంటున్న ఈ రోజుల్లో ఓ ఘటన అందర్ని ఆలోచించేలా చేసింది. తమ్ముని మృతి ని తట్టుకోలేక అక్క మృతి చెందిది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి గ్రామం లో చోటుచేసుకుంది. బంధుమిత్రుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఇంటివద్దనే ఎం.డి.ఇబ్రహీం (72 ) తమ్ముడు శనివారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందాడు.
Mahabubabad : బంధాలు అనుబంధాలు మర్చిపోతూ ఆస్తుల కోసం తగవులాడుకుంటున్న ఈ రోజుల్లో ఓ ఘటన అందర్ని ఆలోచించేలా చేసింది. తమ్ముని మృతి తట్టుకోలేక అక్క మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి గ్రామంలో చోటుచేసుకుంది. బంధుమిత్రుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఇంటివద్దనే ఎం.డి.ఇబ్రహీం (72 ) తమ్ముడు శనివారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందాడు.
తమ్ముడు మరణవార్త విని ఒక్కసారిగా మృతుడి అక్క షాక్కి గురి అయింది. తమ్ముడు ఇంటికి చేరుకొని మృతదేహంపై పడి రోదించింది. కొద్దిసేపటికి ఆమె సృహా తప్పి కింద పడిపోయింది. బంధుమిత్రులు ఆమెను లేపగా అప్పటికే మృతి చెందింది. గుండెపోటుతో మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్.మురళీ నాయక్ , మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్లు గ్రామానికి చేరుకుని ఇరువురి మృతదేహాలపై పుష్పగుచ్చా లు ఉంచి నివాళులర్పించారు. మానవ సంబంధాలకు విలువ లేకుండా పోయిన ఈ రోజుల్లో ఈ ఘటన అందర్ని ఆలోచింపజేసేలా చేసింది.