Chandrababu : టీడీపీ తిరువూరులో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగించిన తీరు అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. పలు అనుమానాలను దారి తీశాయి. ఎన్టీఆర్ జిల్లా లోని వైసీపీ ఎమ్మెల్యేలపై పేరుపేరునా విమర్శల జల్లు కురిపించారు చంద్రబాబు. అయితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాత్రం ఎలాంటి విమర్శలు చెయ్యలేదు.
Chandrababu Naidu : టీడీపీ తిరువూరులో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగించిన తీరు అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. పలు అనుమానాలను దారి తీశాయి. ఎన్టీఆర్ జిల్లా లోని వైసీపీ ఎమ్మెల్యేలపై పేరుపేరునా విమర్శల జల్లు కురిపించారు చంద్రబాబు. అయితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాత్రం ఎలాంటి విమర్శలు చెయ్యలేదు.
రాష్ట్రంలో ఎక్కడ సభ పెడితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు విమర్శించారు. అయితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను మాత్రం ఎందుకు స్కిప్ చేశారు..? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. గత కొన్ని రోజుల నుంచి వైసీపీలో మార్పులు చేర్పుల కార్యక్రమం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.
అచ్చన్నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ లోని హేమాహేమీలు కూడా పార్టీని వీడనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా టీడీపీని సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ వచ్చే వాళ్ళను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు వసంత కృష్ణప్రసాద్ ను ఒక్క మాట కూడా అనలేదు. దీనితో వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారనున్నారా? టీడీపీ అతడిని ఆహ్వానించిందా? అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి.