KTR : సిట్టింగ్ ఎమ్మెల్యేల వలనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినట్లు కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ జహీరాబాద్ లో ఆదివారం లోక్సభ సన్నాహక సమావేశం జరిగింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
KTR : సిట్టింగ్ ఎమ్మెల్యేల వలనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినట్లు కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ జహీరాబాద్ లో ఆదివారం లోక్సభ సన్నాహక సమావేశం జరిగింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన వాళ్లు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని అన్నారు.
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట ఒకవంతు సీట్లు గెలిచాం. కాంగ్రెస్ పార్టీ అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ఠను మూటగట్టుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతోంది. పోటీలో బీఆరఎస్ పార్టీకె పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్ కమిషన్ వేస్తానంటున్నారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అని ఆయన విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బాగుండేది. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వం. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లోకి తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదాం’’ అని కేటీఆర్ అన్నారు.