Abhayahastam Application : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో శివుడి పేరుతో అభయహస్తం దరఖాస్తు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్థానికంగా నివసించే ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి.. శివయ్య పేరుతో దరఖాస్తు చేశాడు.
ఆ దరఖాస్తులో భార్య పేరు పార్వతీదేవిగా.. కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడిగా రాసుకొచ్చాడు. గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతుబంధు, ఇందిరమ్మ గృహానికి దరఖాస్తు చేసినట్లు అందులో ఉంది. అయితే ఆ దరఖాస్తు స్వీకరించినట్లు అధికారులు రశీదు కూడా ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ అప్లికేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.