AP Elections 2024: ఏపీలో మూడు రోజులు పాటు కేంద్ర ఎన్నికలు కమిషన్ పర్యటించనుంది. కేంద్ర ఎన్నికల కమీషన్ బృందం సోమవారం ఉదయం విజయవాడ చేరుకొనుంది. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలతో మంగళ వారం ఎన్నికలు సంఘం సమావేశం నిర్వహించనుంది. రాష్ట్రంలో భారీగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ రాజకీయా పార్టీలు ఒకరిపై మరొకరు పరసర్పం ఆరోపణలు చేశాయి. ఓట్లు తొలగింపులో భారీగా అవకతవకలు జరిగాయని గతంలో రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికలు సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి.
AP Elections 2024: ఏపీలో మూడు రోజులు పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం సోమవారం ఉదయం విజయవాడ చేరుకొనుంది. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలతో మంగళ వారం ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది. రాష్ట్రంలో భారీగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ రాజకీయపార్టీలు పరసర్పం గతంలో ఆరోపణలు చేశాయి. ఓట్ల తొలగింపులో భారీగా అవకతవకలు జరిగాయని, రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి.
ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై ఎన్నికల ప్రధాన అధికారితో సమీక్ష నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా జిల్లాల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనుంది. ఈ నెల 10న కేంద్ర విభాగాలు, డీజీపీ , సీఎస్ వివిధ శాఖల కార్యదర్శులతో ఎలక్షన్ కమిషన్ సమావేశం నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు సీఈసీ మీడియా సమావేశం నిర్వహించనుంది.