EPAPER

Botsa Jhansi: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ?

Botsa Jhansi: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ?

Botsa Jhansi: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్యసత్యనారాయణ సతీమణి డాక్టర్‌ ఝాన్సీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. విశాఖ ఎంపీగా ఉన్న ఎంవివీ సత్యనారాయణ ఈస్ట్ అసెంబ్లీకి పోటీ చేస్తుండడంతో కొత్త అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేసిన పార్టీ అధిష్టానం.. సుదీర్ఘ చర్చల అనంతరం బొత్స ఝాన్సీని నిలబెట్టాలని నిర్ణయించింది. ఉన్నత విద్యావంతురాలు కావడంతోపాటు.. ఉత్తరాంధ్ర కాపు సామాజికవ వర్గం కావడం సానుకూల అంశంగా భావించింది. దీంతోపాటు రాజకీయ అనుభవం ఉండటంతో బొత్స ఝాన్నీని ఎంపీ అభ్యర్థిగా ఎంపికి చేసినట్టు సమాచారం. గతంలో జడ్పీ చైర్మన్‌గా, రెండుసార్లు లోక్ సభ ఎంపి గా పని చేశారు.


కాగా.. ఝాన్సీ పోటీ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం ఉంటుందన్న ఆలోచనలో ఉంది అధికార పార్టీ. స్థానిక బీసీ నేతకు సీటు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రలోని 80 శాతం బీసీలను ప్రభావితం చేయవచ్చని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే వైజాగ్‌ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్నీ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఝాన్సీ అభ్యర్థిత్వంతో మిగతా పార్టీలు కూడా బీసీ నేతలకు ఇవ్వాల్సి వస్తుందన్న రాజకీయ ఎత్తుగడ కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు విశాఖ లోక్‌సభ అభ్యర్థులుగా ఉత్తరాంధ్రతో సంబంధం లేని ఓసీ కులాల వారే ఉన్నారు. 2004 లో నేదురుమల్లి, 2009లో పురంధరేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంవీవీ సత్యనారాయణ ఎంపీగా ఎన్నికయ్యారు.


Related News

Tirupati Laddu Row: తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తున్నారంటేనే అర్థమవుతోంది.. ఏదో జరుగుతోందని: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Big Stories

×