Nellore : మోచర్ల వీరపల్లి మధ్యలో ఉన్న 16వ నంబర్ జాతీయ రహదారిపై తెలంగాణ ఆర్టీసీ బస్సు.. లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ వినోద్ (35) అక్కడికక్కడే మరణించాడు. తెనాలి నుండి నెల్లూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ఎంజీబీఎస్ నుండి తిరుపతికి బస్సు బయలుదేరింది. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద తెల్లవారుజామున డ్రైవర్ నిద్ర మత్తులో ముందు వెళ్తున్న ధాన్యం లారీని తప్పించబోయి అతివేగంగా లారీని ఢీకొట్టాడు.
దీంతో డ్రైవర్ వినోద్ మృతిచెందగా బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురు స్వల్పంగా గాయాపడ్డారు. గూడూరు ఎస్సై ప్రసాద్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి గాయపడిన ప్రయాణికులను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో మిగిలిన ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానలకు పంపించినట్లు ఆయన తెలిపారు.