Sharad Mohol : పుణెలో గ్యాంగ్స్టర్ శరద్ మోహల్ (40)పై అతడి గ్యాంగ్ సభ్యులే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ మరణించాడు. శరద్ మోహల్కు గ్యాంగ్ సభ్యులకు మధ్య కొంత కాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు తలెత్తాయి. దీంతో అతనిపై కాల్పులు జరిపారు. సమాచారం అందుుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
Sharad Mohol : పుణెలో గ్యాంగ్స్టర్ శరద్ మోహల్ (40)పై అతడి గ్యాంగ్ సభ్యులే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ మరణించాడు. శరద్ మోహల్కు గ్యాంగ్ సభ్యులకు మధ్య కొంత కాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు తలెత్తాయి. దీంతో అతనిపై కాల్పులు జరిపారు. సమాచారం అందుుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
రక్తపు మడుగులో పడి ఉన్న శరద్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఐదు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డబ్బు, భూ వివాదాల కారణంగానే అతడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. కేసు దర్యాప్తు కోసం తొమ్మిది బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. గతంలో శరద్ మోహల్పై అనేక పోలీస్స్టేషన్లలో దోపీడి, హత్య కేసులు నమోదయ్యాయి.