Cyber crime : సైబర్ క్రైమ్ విభాగం 2 కీలకమైన కేసులు చేధించినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. డిఫాజిట్ వెబ్ సైట్ ద్వారా నందితులు మోసాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఓ వ్యక్తి డిఫాజెట్ లో రూ.70 లక్షలు పెట్టి ఆన్లైన్ గేమ్లు ఆడారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించి ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Cyber crime : సైబర్ క్రైమ్ విభాగం 2 కీలకమైన కేసులు చేధించినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. డిఫాజిట్ వెబ్ సైట్ ద్వారా నిందితులు మోసాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఓ వ్యక్తి డిఫాజెట్ లో రూ.70 లక్షలు పెట్టి ఆన్ లైన్ గేమ్లు ఆడారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించి ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోస పోయిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీపీ వెల్లడించారు. వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా ఓ నిందితుడు పట్టుబడ్డాడని సీపీ తెలిపారు. నిందితుడిని హర్యానాకు చెందిన హితేశ్ గోయల్ గా గుర్తించారు. అతడు గత కొన్ని రోజులుగా సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్నట్ల సీపీ వెల్లడించారు. నిందితున్ని పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారని సీపీ తెలిపారు. అతని నుంచి రూ. 1.40 కోట్ల నగదు సీజ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.