Nara Chandra babu : ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండోరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కనిగిరి పార్టీ కార్యాలయం పక్కన నియోజకవర్గ ఇన్ఛార్జి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏడాదిగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ను ఆయన పరిశీలించారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పైలాన్ను ఆవిష్కరించారు. పేదలకు స్వయంగా భోజనాలు వడ్డించారు. కార్యకర్తలు, అభిమానులతో ఫొటోలు దిగారు. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రూపొందించిన పాటల సీడీని చంద్రబాబు ఆవిష్కరించారు. వైసీపీకి చెందిన పలువురు నాయకులకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జిలతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం హెలికాప్టర్లో చంద్రబాబు హైదరాబాద్కు వెళ్లారు.